Category Archive Proddatur FPO- Kadapa

40-2022(07-10-22)Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 25mm. గరిష్ట ఉష్ణోగ్రత -31డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 9కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
👉 తల్లమా పురం క్లస్టర్ లో సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమా పురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి , రేగుల్లపల్లి లో ఇప్పుడు అధిక వర్షాలకు పంట పొలాల్లో మురుగు నీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి , పొలంలో ఎరువులు వేయడం అపుకోవాలి,
వర్షాలు తగిన తర్వత
మురుగు నీటి ని
వీలైనంత వరకు బయటకు పంపించాలి
రైతులకు ముఖ్య సూచనలు
ఈ-క్రాప్ EKYC :-
👉 ఇప్పటివరకు ఎవరైతే పంట నమోదు చేపించి ఉన్నారో, అటువంటి రైతులు అందరూ ఇన్సూరెన్స్ కొరకు మరల మీయొక్క ఈకేవైసీని చేపించవలసి ఉన్నది.
కావున ఇందు కొరకు రైతులందరూ మీ యొక్క ఆధార్ కార్డు, పొలం పాస్ బుక్కు , ఆధార్ కి లింక్ అయిన సెల్ ఫోన్ తీసుకుని రైతు భరోసా కేంద్రం వద్దకు రావలెను.
🚨ఈకేవైసీ చేపించనటువంటి రైతులకు ఇన్సూరెన్స్, ఇతర పథకములు వర్తించవు. కావున పంట నమోదు చేపించిన ప్రతి ఒక్క రైతు EKYC చేపించవలెను.
సమయం :- ఉదయం 9.00 కి మొదలు పెట్టి, 11 గంటల వరకు చేయడం జరుగుతుంది. 11 గంటల తర్వాత సర్వర్ పని చేయదు.
*వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ
వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ తగివిధంగా జాగ్రత్తలు పాటిస్తే పాల దిగబడి తగ్గకుండా అలాగే రోగాల బారి న పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పశువులను పాకలో పెట్టాలి, అధిక వర్షాలకు, గాలికి తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయి, కాబట్టి వీటి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి.
అన్ని పశువులకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.

39-2022(02-10-2022) Proddatur Mandal Farm advisory

Farm advisory

Date-2/10/2022
Centre for Sustainable Agriculture (CSA)
Kisan Mitra centre -Farm Advisory
Proddatur మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 18mm. గరిష్ట ఉష్ణోగ్రత -31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమాపురము క్లస్టర్ లో సౌరెడ్డి పల్లి,రేగుల్లపల్లి కల్లూరు,తల్లమాపురం సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో
ఇప్పుడు అధిక వర్షాల కు
👉వరిలో, పత్తి లో వేరుసనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఎరువులు వేయడం ఆపుకోవాలి. వర్షాలు తగ్గిన తరువాత మురుగు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన తరువాత, నీటి ముంపునకు గురి అయిన వరిలో పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు నివారణకు పేడమూత్రం ఇంగువ ద్రావణం స్ప్రే చేయాలి
*పొలంలోకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.

  • అలాగే పచ్చ, తెల్ల దోమ ల నివారణకు, తెలుపు, పసుపు ప్లేట్లు అమార్చుకొని , దోమ ఉధృతిని బట్టి నీమాస్త్రం పిచికారీ చెయ్యాలి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయాలి,
    👉 వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణ
    వర్షాకాలంలో పశువుల పెంపకం మరియు పోషణపైన తగిన జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా అలాగే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చును.
    👉పశువులను పాకలలో పెట్టాలి, అధిక గాలి వానకు తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి.
    👉వీలైనంతగా పాకలను శుభ్రoగా మరియు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి.
    నీరు నిల్వ ఉండడటం వలన దోమలు మరియు ఈగలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి,
    👉కాబట్టి వీటి నిర్మూలనకు చర్యలను చేపట్టాలి.
    అన్ని పశువులకు వ్యాధి నిరోధక టీకాలు మరియు పరాన్న జీవుల నిర్ములకార్యక్రమాలను చేపట్టాలి.
    👉పచ్చిగడ్డిని కొంతమేరకు తగ్గించి ఎండుమేతను, దాణాగా వాడాలి.
    మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం.

33-2022(21-08-2022)Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన వర్షము – 2mm కురిసే అవకాశం వుంది . గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 27 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తాళ్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులకు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
ఇలా గతవారం చెపుకున్నాము, రైతులు ఒక సారి గమానించగలరు,
అలాగే పత్తి పంట వేసుకున్న రైతులు ముక్యంగా గమనించవలసిన విషయాలు,
1.మొదట నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి,
2.దేశీ వాలి విత్తనాలను సాగుచేయాలి,
3.పత్తి పంట లో అధికంగా గులాబీ రంగు పురుగు వృధితి ఎక్కువ గ ఉంటుంది
ఈ పురుగు అదుపు కు ఎమి చేయాలి.
విత్తనం పొలంలో నాటే ముందు విత్తన శుద్ది చేయాలి, ఇలా చేయడం వల్ల భూమి నుండి సంక్రమించే తెగులు రాకుండా చేసుకోవచ్చు
*పత్తిలో అలసంద, పెసలు, సోయాబీన్స్ అంతర పంట గా వేయడం వల్ల రైతు మిత్ర పురుగులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సస్యరక్షణ జరుగుతుంది, ఈ అంతర పంటలు వల్ల ఆదాయం కూడా వస్తుంది,
*యరపంట ఆముదం ,బెండ పత్తి పంట లో నాటుకొని దానిపై ఆశించిన లార్వాలు ను ,పురుగు గుడ్లను నాశనము చేయలి,
*పత్తి పంట చుట్టూ రక్షిత పంట గా 4 వరసలు జొన్న,సజ్జ విత్తాలి.
*పురుగుల మందులు పిచికారీ ఆపేయడం వల్ల పొలంలో మిత్ర పురుషులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది.
*పొలంలో ఎకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.
*తల్లి పురుగుల గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయం పిచికారీ చెయ్యాలి 5 రోజుల వ్యవధి తో 2 సార్లు స్ప్రే చేయాలి,
మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం

32-2022(14-08-2022) Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 2mm. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 26 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
1.భూసార యాజమాన్య పద్ధతులు
2.సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
భూసార యాజమాన్య పద్ధతులు:
వివిధ రకాల విత్తనాలతో పచ్చి రొట్టె ఎరువులు పెంచి 40 రోజుల వయసులో భూమి లో దున్నాలి,మొక్కలకు పోషక పదార్థాలు అందించే సూక్ష్మ క్రిములు బాగా పెరిగి భూమిలో జీవపదారం అభివృద్ధి చెందుతుంది, సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళి పోషకాలు విడుదల అవుతాయి.
ఈ విషయాలు రైతులు గమనించాలి.
*సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది*
ఎపుడు; నారు నాటే ముందు
ఎందుకు: నారు ద్వారా ఆశించే తెగుళ్లు ను నివారించడానికి
*పసుపు, తెలుపు ప్లేట్స్
ఎపుడు; నారు నాట్లు వేసిన తర్వాత ,ప్లేట్స్ మొక్కలకు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
ఎందుకు: చిన్న చిన్న రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ని తెలుసుకోవచ్చు, వాటిని నివారించవచ్చు.
ఎకరానికి 20నుండి 25 ప్లేట్స్ పెట్టాలి.
*రక్షకపంటలు
ఎపుడు:వరిలో నాట్లు వేసిన తర్వాత బంతి నారు నాట్లు వేయాలి.
ఎందుకు:పురుగుల, తెగుళ్లు వ్యాప్తి ని నివారించడానికి, మిత్ర పురుగుల అభివృద్ధి కి
*లింకాకర్షక బుట్టలు
వరిలో నాట్లు వేసిన తర్వాత 10నుంచి 15 పెట్టాలి, వరిలో కాండం తొలిచే పురుగు నివారించడానికి
కోసలు తుంచి నాటడం :
వరి నాట్లు వేయడానికి ముందు ,కాండంతొలిచే పురుగు గుడ్ల సముదాయం నివారించడానికి, నాటే ముందు కోసలు తుంచి నాటాని
*కాలిబాటలు
వరి నాట్లు వేసే సమయంలో దోమ పొట్టు మరియు రసం పీల్చే పురుగుల నియంత్రించేందుకు వరిలో ప్రతి 2 metres లకు 30 cm కాలి బాటలు వదలాలి.
వరిలో అజోళ్ళ
పంటకు నత్రజని అందించడానికి, కలుపు నివారణకు ఉపయోగపడతాయి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.

27-2022(09-07-2022) Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – వర్షము 8mm కురిసే అవకాశం వుంది. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట కు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా గత వారం లో చెపుకున్న విషయాలు మళ్ళీ ఒక సారి గుర్తు కు చేసుకున్నాము,విత్తనసుద్ది, ఘనజీవమృతం, ద్రావజీవమృతం
ఇప్పుడు ఈ వారంలో రైతులు మంచి విత్తనం యంపీక చేసుకోవాలి,, నారు పెట్టడానికి , అనువైన పొలాన్ని నారు మడి కోసం యంపీక చేసుకోవాలి,
నారుమడిలో మెళకువలు తెలీసుకున్నాము:
బెంగాల్ పద్ధతి నాట్లు,
సంప్రదాయం నాట్లు, బెంగాల్ వాళ్ళు నాట్లకు 2 సెంట్స్ నారు మడ్డి అయితే సరిపోతుంది, ఎకరాకు,
అదేవిధంగా సంప్రదాయం నాట్లు అయితే 4 నుంచి 5 సెంట్స్ లో నారు మడి సరిపోతుంది ఎకరాకు,
*నారు మడి ని వారం రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి ,బాగా చివికిన పశువుల ఎరువును 200 కిలోల 5 సెంట్స్ నారు మడికి వేయాలి,
*చివరి దమ్ము లో తయారు చేసుకున్న ఘనజీవమృతం, వేసుకోవాలి, ట్రైకోడర్మ 1kg నారు మడి కి వేసుకోవాలి,
మొలక కట్టిన విత్తనాన్ని బీజామృతం తో విత్తనసుద్ది చేయాలి, సెంటు నారు మడికి 4 to 5 కిలో చొప్పున నారు మడిలో పలుచగా నీరు పెట్టి చలలి, మరుసటి రోజు మడి నుంచి నీటిని పూర్తిగా తీసివేయాలి, ఆకులు బయటకు వచ్చే వరకు ఆరుతడి పెట్టాలి,
విత్తనం చలిన 7 to8 రోజుల కు 5 సెంట్స్ నారు మాడి కి 10:1 లో ద్రావజీవమృతం పారించాలి, అంటే 100 లీటర్ కు ఒక లీటర్ చొప్పున పారించాలి, ఇలా చేవడం వల్ల నారు బాగా ఉండి ,పిలకలు ఎక్కువ వచ్చి ,దిగుబడి అధికంగా ఉంటుంది.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.