Monthly Archive July 9, 2022

27-2( 9-7-2022) Vepada Farm Advisory

Date: 9-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-40mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-15km వేగంతో దక్షిణం నుండి పడమర దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లులో నారు మడులలో వరి విత్తనాలు వేసుకోవాలనుకునే రైతులు బీజామృతం తో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవలెను. బీజమృతం తయారు చేసుకొనుటకు 20lt నీరు, 5kg ఆవు పేడ, 5lt ఆవు మూత్రం,50gm సున్నం, పిడికెడు పుట్టమన్ను తీసుకోవాలి. 20lt నీటిలో పెడను గుడ్డలో మూటకట్టి vrelada deeyavalenu. ఇందులో ఆవు మూత్రం ,సున్నం కలుపుకొని 12hrs అలాగే ఉంచు రోజుకి రెండు సార్లు కర్ర సహాయంతో కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న బీజామృతమును విత్తడానికి సిద్ధముగా ఉన్న విత్తనలపై చల్లి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవలెను. దీనివలన విత్తనం బాగా మొలకెత్తి, విత్తనం నుండి సంక్రమించే వ్యాధులను నియ0త్రిస్తుంది.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

27-2022(09-07-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 19 mm వర్ష పా తం రాగల దని సూచన , అలాగే గంటకి 31 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలి వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి ,టీవీ పల్లె ,బక్కనగారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ఉదృతి ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది.అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పంట పూత దశకు రాక మునుపే పెట్టుకోవడం వలన పురుగును నివారించవచ్చు. పత్తి లో మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం లేదా వేపనూనె పిచికారి చేయాలి. అలాగే వర్షం ఆధారంగా వేసుకొనే పత్తి రైతులు ముందుగా బీజామృతం లేదా టి విరిడి తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. జిగురు పల్లాలు, కాషాయ లు విత్తనాల కిట్ వేంపల్లి ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.

26-2(2-7-2022) Vepada Farm Advisory

Date: 2-7-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-11mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34-35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-13km వేగంతో దక్షిణం నుండి నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లులో వరి వేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతిలో నారు మడిని తయారు చేసుకునేందుకు ఎకరానికి 5సెం. నారుమడిని సిద్దం చేసుకోవాలి. మెట్టు భూమిలో సాగుచేస్తున్నవారు దుక్కు చేసుకునేటపుడు దుక్కులో 10కేజీల ఘనజీవామృతం, 10కేజీల మాగిన పశువులపెడ, 10కేజీల వేపపిండి వేసుకొని దున్నుకున్న తర్వత బీజామృతం తో విత్తన శుద్ది చేసుకొని విత్తుకోవలెను. అలాగే దంప పద్ధతిలో నారుమడి తయారుచేస్తున్న రైతులు దమ్ములో 10కేజీలు ఘనజీవామృతం,10కేజీలు పశువుల పెడ, 10కేజీలు వేప పిండి వేసుకొని బీజామృతంతో విత్తనశుద్ది చేసుకొని మండె కట్టుకొని విత్తనాలను జల్లుకోవాలి. విత్తనాలు విత్తుకున్న 15రోజులకు నీమాస్త్రం, ద్రవజీవామృతం పారించుకుని 4ఆకుల తర్వాత నాటుకుంటే ఎక్కువ పిలకలు వస్తాయి. శ్రీ వరి పద్దతిలో 10-12రోజుల నారును ప్రధానపొలంలో నాటుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

26-2022(01-07-22) Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల 5 రోజులలో 10 mm వర్ష పా తం రాగల దని సూచన , అలాగే గంటకి 22 కి.మి. వేగంతో పడమర దిశా గ గాలి వీయవచ్చు .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పాలపల్లి ,టీవీ పల్లె ,బక్కనగారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంది.దీనిని నివారణ చేయడానికి ఒక ఎకరానికి జిగురు పల్లాలు 25 నుండి 30 వరకు పెట్టాలి. తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది.అలాగే పత్తి మరియు చీనీ పంటలలో పోషక లోపల కొరకు జీవామృతం పారించలి. అలాగే అరటి పంటలలో ఇగురు లో పచ్చ పురుగు నివారణకు నీమస్త్రం ,వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఇప్పుడు పత్తి నాటే ప్రతి రైతు దుక్కిలో200 నుండి 400కేజీల ఘనజీవమృతం తయారు చేసుకొని వేసుకోవాలి.ఘన జీవామృతం వేసుకోవడం వలన భూమిలో సూక్ష్మ జీవుల అభివృధి చెందుతాయి.మరియు విత్త నాలు నాటే ముందు బీజమృతం లేదా టీ విరిడి తో విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వలన భూమి నుండి వచ్చే తెగుళ్లు, విత్తనం నుండి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు.మరింత సమాచారం కొరకు 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి. వేంపల్లి,జిగురు పల్లాలు, కాషాయ లు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసిన రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.