Yearly Archive November 26, 2022

47-2022(26-11-2022) Vepada Farm Advisory

Centre for Sustainable Agriculture
Date: 26/11/2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-33డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16-17డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8km వేగంతో పడమర నుండీ తూర్పు దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 48-50% ఉండవచ్చును.
👉 K.G పూడి,Sksr పురం క్లస్టర్లులో ప్రధాన పంట అయిన వరి 80%వరకు కోతకు సిద్దంగా ఉన్నది కావున రైతులు కొత్త కోసె వారం రోజులు ముందు పొలాల్లో ఉన్న నీరుని తీసి నేలను ఆరబెట్టినట్లు ఉంచవలెను. అలాగే 80%గడ్డి రంగు పసుపు రంగులోకి మారి తేమ శాతం 20కి మించకుండా కోయవలెను.ధాన్యపు గింజలు గట్టిపడకముందు కోసినట్లైతే వర్షాలకు మొలకెత్తడం లేదంటే కుళ్లిపోవడమ్ జరిగి నాన్యత మరియు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే గింజ బాగా గట్టిపడిన తర్వాత కోసినట్లైతే మొలక శాతం తగ్గి నూర్పు సమయంలో గింజ విరిగిపోయే అవకాశం ఉంది కావున రైతులు సరియైన సమయంలో కోత కోయవలెను.
👉అలాగే వరి పొలాల్లో అపరాలు వేస్తున్న రైతులు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవలెను.
👉మరియు జీడి, మామిడి,జామ మరియు ఇతర పండ్ల తోటలులో రైతులు ఇప్పటినుంచే సస్య రక్షణ చర్యలు చేపట్టి ఘనజీవామృతం,పంచగవ్యను ఉపయోగించవలెను ఇలా చేయటం వలన మొక్కకు సూక్ష్మ ,స్థూల పోషకాలు అంది పూత మరియు పింధే శాతం పెరుగును.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

46-2022(19-11-2022) Vepada Farm Advisory

సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేధు.
గరిష్ట ఉష్ణోగ్రత 32-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-10km వేగంతో పడమర నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 42-72% ఉండవచ్చును.
👉 బొద్ధం, R.S పేట, PKR పురం, sksr పురం, జగ్గయ్యపేట, సోంపురం, గుడివాడ, కరకవలస గ్రామాల్లో వరిలో మానిపండు తెగులు ఉదృతి ఉన్నాందువలన రైతులు వావిలకు కషాయం కాని సీతాఫల కషాయం పిచికారి చేయవలెను.
మరియు KG పూడి ,SKSR పురం క్లస్టర్స్ లో వరిలో నాన్యత మరియు గింజ బరువు పెరుగుదలకు రైతులు సప్త ధాన్యంకుర కషాయం పిచికారి చేయవలెను.
👉 బొద్ధం, జగ్గయ్యపేట, pkr పురం గ్రామలలో మిరపలో ఆకుముడత ఉన్నందువలన రైతులు ఎకరానికీ 15-20నీలి రంగు జిగురు అట్టలను ఏర్పరచి వేపనూనె కానీ నీమాస్త్రం కానీ పిచికారి చేసుకోవలెను.
👉KG పూడి, Sksr పురం క్లస్టర్‌లో జీడి,మామిడి,అరటి తోటలలో అంతర పంటలుగా పప్పు దినుసులు, కూరగాయలు వేసుకోవలెను ఇలా చేయటం వలన 365రో. భూమిని కప్పి ఉంచడమే కాకుండ అంతర పంటల ఆధాయం కూడా రైతులకు లబిస్తుంది. అలాగే RDS పద్దతిలో పలు అంతర పంటలు వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

45-2022(12-11-2022) Vepada Farm Advisory

Centre for Sustainable Agriculture
Date: 12/11/2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – ఆకాశం మేఘవృతమై ఉండి 0-6mm మోతదులో తేలికపాటి వర్షం కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 33-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో తూర్పు దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 60-67% ఉండవచ్చును.
👉 జగ్గయ్యపేట, గుడివాడ, కరకవలస గ్రామాల్లో ప్రధాన పంట అయిన వరిలో సుడి ధోమ లేధా ధోమపోటు ఉదృతి ఎక్కువగా వున్నది కావున రైతులందరు ఎకరానికీ 15కిలోల ఇసుకకు 1.5 lt వేప నూనెను బాగా పట్టించి రాత్రoత ఉంచి ఉదయాన్నే పొలంలో చల్లితే పురుగు ఉదృతి తగ్గుతుంది లేధా తూటికాడ కషాయం పిచికారి చేసుకోవలెను.
👉KG పూడి, Sksr పురం క్లస్టర్లలో వరి వేసుకున్న రైతులు మాణిపండు తెగులు రాకుండా సీతాఫల కషాయం తయారుచేసి ముందుగానే పిచికారి చేసుకున్నట్లైతే తెగులును నివారించవచ్చును.
👉అలాగే రబీ డ్రై సోయింగ్ పద్దతిలో మినుములు ,పెసలుతో పాటు బొబ్బర్లు,ఉలవలు,రాగులు,జొన్న ,మొక్క జొన్న విత్తనాలను ఎకరానికీ 10-12కిలోల మోతదులో బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవలెను. థేమ శాతం తక్కువుగా ఉన్న ప్రాంతాలలో ఈ పద్దతిలో వేసినట్లైతే భూసారం పెరగడమే కాకుండా రైతులకు అధిక ఆదాయం కలుగుతుంది.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

44-2022(5-11-2022) Vepada Farm Advisory

Centre for Sustainable Agriculture
Date: 5/11/2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – ఆకాశం మేఘవృతమై ఉండి 3-10mm మోతదులో తేలికపాటి వర్షం కురిసే సూచన ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత 32-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18-20డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-8km వేగంతో తూర్పు నుండీ ఆఘ్నేయ దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 49-68% ఉండవచ్చును.
👉బోద్ధం, R.S పేట, Pkr పురం, Sksr పురం, సోంపురం,జగ్గయ్యపేట, చామలపల్లి గ్రామాల్లో బాక్టీరియా కంకి యెండు తెగులు నివారణకు రైతులు సొంటిపాల కషాయం పిచికారి చేసుకోవలెను.
👉KG పూడి, Sksr పురం క్లస్టర్లులో జీడి,మామిడి,అరటి తోటలలో మొక్క ఏధుగుధలకు,పురుగులు,తెగుళ్లు అధుపులో ఉండుటకు, మరియు పంటకు కావాల్సిన అన్నీ సూక్ష్మ,స్థూల మూలకాలు మొక్కలకు అందించుటకు ఎకరానికి 3lt పంచగవ్యను 100lt నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవలెను.
👉 మరియు రబీలో అంతర పంటలుగా చిరు ధాన్యాలు,పప్పు దినుసులు వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

43-1(26.10.22) Vepada farm advisory

Date:26.10.2022
Vepada farm advisory-సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 34-35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20-21డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-9km వేగంతో తూర్పు నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 52-59% ఉండవచ్చును.
👉 Sksr పురం,K.G పూడి క్లస్టర్లలో వరిలో గింజ బరువు పెరగటానికి,నాన్యత మరియు మెరుపు రావటానికి రైతులు సప్త ధాన్యంకుర కషాయం ఎకరానికి 200lt నీటిలో 10lt ఆవు మూత్రం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చు.
👉Sksr పురం , బోద్ధం గ్రామంలో అరటి తోటలలో మొక్క ఎదుగుదలకు మరియు గెలలు పెద్దవిగా రావటానికి రైతులు ద్రవజీవామృతం పారించుకోవలెను.
👉 మరియు నాటుకోళ్లలో రాణిఖేత్ లేద కొక్కెర వ్యాధి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ వ్యాధి వలన కోళ్లలో జీర్ణ,శ్వాసకోస సమస్యలతో పాటు గ్రుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. మరియు విపరీతమైన విరేచనాలతో కోల్లు చనిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.కావున వ్యాధిని నివారించడానికి పశు వైద్యుని పర్యవేక్షణలో R.D టీకాలు వేయించాలి.ద్వితీయ సంక్రమణంను నియంత్రించుటకు యాంటీబయాటిక్స్ మందులను వాడాలి. అలాగే వ్యాధి సోకిన కోళ్ల నుండి సురక్షిత కోల్లను వేరుచేసి ఉంచవలెను.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబరును సంప్రదించగలరు.

42-2(22.10.22) Vepada farm advisory/

Date: 22.10.2022
Vepada farm advisory-సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 1-4mm మొతాదులో ఆకాశం మేఘవృతమై ఉండి వేరు వేరు ఛోట్ల తెలికపాటి వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-34డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-23డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-12km వేగంతో తూర్పు నుండీ వాయువ్య దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-70% ఉండవచ్చును.
👉 Sksr పురం,K.G పూడి క్లస్టర్లలో ప్రధాన పంట అయిన వరిలో నల్లి పురుగులు పొట్ట దసలలో ఉన్న వరి పైరుపై చేరి గింజల లోపల అండాశయాన్ని, పుప్పొడిని నష్టపరచటం వలన వెన్నులో అక్కడక్కడ తాలు గింజలు ఏర్పడి ఊదా రంగు మచ్చలు ఏర్పడుతున్నాయి.దీ నిని నల్లకంకి అని కూడా అంటారు కావున రైతులు ఈ లక్షనాలు గల గింజలు కనిపించినట్టైతే పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉 మరియు వరిలో పొడ తెగులు,అగ్గి తెగులు,ఆకు యెండు తెగులు నివారణకు రైతులు గట్లపై కలుపు మొక్కలను తీసి , పశువుల పెడ-మూత్రం-ఇంగువ ద్రావణం పిచికారి చేయవలెను.
👉అలాగే pkr పురం, Sksr పురం గ్రామలలో బెండలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు ఉదృతి ఉన్న0దువలన రైతులు 6lt పుల్లటి మజ్జిగలో 100gmల ఇంగువను 100lt నీటికి కలుపుకొని పిచికారి చేసుకోగలరు.
👉Pkr పురం, సారవానిపాలెం, కోటయ్యగరువు,చిట్టివానిపాలెం గ్రామాలలో బరబాటి,చిక్కుడు లో పేను బంక నివారణకు వేపనూనెను లేధా నీమాస్త్రం పిచికారి చేసుకొని నివారించవచ్చును.
👉అలాగే వరి పొలాల్లో ఎలుకలు నివారణకు రైతులు ఎకరానికి 4పచ్చి బొప్పాయి కాయలను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. పచ్చి బొప్పాయిలో ఉన్న ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హానీ కలుగచేస్తుంది లేధా సిమెంట్ ను,మైదా పిండిని సమబాగాల్లో కలిపి పొట్లాలు కట్టి కలుగుల వద్ద ఉంచితే అవి తిన్న ఎలుకల నోటి భాగాలు పిడచగట్టుకుపోయి నశిస్థాయి.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ను సంప్రదించగలరు

42-2022(21-10-22)Thungabhadra Farm Advisory

కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 12 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలిలో తేమశాతం 59% – 87% దాకా ఉండవచ్చు. గాలి గంటకి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా వీయవచ్చు. కొండాపురం, పలదొడ్డి, ముడుమాల మరియు ఈర్లదిన్నె గ్రామాలలోని వరి పొలాలలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణ కొరకు జిగురు అట్టలు పెట్టుకోవాలని, అలాగే నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం పిచ్చికారి చేసుకోవాలని, ఆకు ముడత పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని తెలియజేయడం జరిగింది. మిరప పంటలలో త్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని, వావిలాకు కషాయం పిచికారి చేయాలని, ఆకు ముడత నివారణకు పచ్చిపాలు లేదా పుల్లటి మజ్జిగ పిచికారి చేయాలని, తెగుళ్ల నివారణ కొరకు ఆవుపేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది.పత్తి పంటలలో గులాబీ రంగు పురుగు మరియు మొక్కజొన్న పంటలలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని, అలాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. తుంగభద్ర FPO ఆఫీస్ నందు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100/- రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10/- రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,40 కిలోల వేప పిండి బస్తా 950/- రూపాయలకు, డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177427817 మరియు 9492761257. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామాలలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి. వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు CSA సంస్థ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.

42-1(19.10.2022) Vepada farm advisory

Centre for Sustainable Agriculture
Vepada farm advisory
Date: 17.10.2022
సుస్థిర వ్యవసాయ కేంద్రం-వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-15mm మొతాదులో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-7km వేగంతో పడమర దిశగా వీయ్యవచ్చు. గాలిలో తేమసాతం 59-87% ఉండవచ్చును.
👉 బొద్దాం,R.S పేట,PKR పురం,Sksr పురం,సోంపురం, జగ్గయ్యపేట, చామలపల్లి గ్రామలలో వరిలో పొడ తెగులు ఉదృతి ఎక్కువగా ఉన్నాఁధున రైతులు గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసి ,5%వేప కషాయం పిచికారి చేయవలెను.లేధ పెడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారి చేయవచ్చును.
👉కోటయ్యగరువు, సారవానిపాలెం గ్రామాల్లో వరిలో ఆకుపచ్చ కొమ్ము పురుగు నివారణకు రైతులు లార్వాలను నసింపచేసి పంచపత్ర కషాయం పిచికారి చేయవలెను.
👉 మరియు వరిలో ఎలుకల నివారణకు రైతులు పొలం లో ఉన్న బొరియలను పూడ్చి , విషపు ఎరలుగా గ్లైరిసిడియా ఆకులను మెత్తగా నూరి టమాటతో కాని గోధుమ పిండిలో కానీ కలిపి ముద్దలుగా చేసి పొలాల్లో ఉంచినట్లైతే ఎలుకలు అవి తిని చనిపోయే అవకాశం ఉంధీ.అలాగే పొలాల్లో పాములు రాకుండా సర్పగంధ,నిమ్మ గడ్డిని పెంచుకుని నివారించవచ్చును.
👉మరియు మెట్టప్రాంతాలలో చిరుధాన్యాలు,పండ్ల తోటలలో అంతర పంటలుగా మినుములు,పెసలు,ఉలవలు మో|| పంటలను వేసుకుంటున్న రైతులు బీజామృతంతో విత్తన సుద్ధి చేసుకొని విత్తుకున్నట్లైతే విత్తనములు నుండి సంక్రమించే వ్యాధులు రాకుండ రక్షణ కలిగించవచ్చును.
👉 మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

41-2022(14-10-22)Thungabhadra Farm Advisory

కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 28 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలిలో తేమశాతం 54% – 91% దాకా ఉండవచ్చు. గాలి గంటకి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా వీయవచ్చు. కొండాపురం, పలదొడ్డి, ముడుమాల మరియు ఈర్లదిన్నె గ్రామాలలోని వరి పొలాలలో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణ కొరకు జిగురు అట్టలు పెట్టుకోవాలని అలాగే నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం పిచ్చికారి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. మిరప పంటలలో తెల్ల దోమ, పచ్చ దోమ మరియు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవాలని, వావిలాకు కషాయం పిచికారి చేయాలని, ఆకు ముడత నివారణకు పచ్చిపాలు లేదా పుల్లటి మజ్జిగ పిచికారి చేయాలని, తెగుళ్ల నివారణ కొరకు ఆవుపేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది.పత్తి పంటలలో గులాబీ రంగు పురుగు మరియు మొక్కజొన్న పంటలలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున నివారణకు బ్రహ్మాస్త్రం పిచికారి చేయాలని, అలాగే ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. తుంగభద్ర FPO ఆఫీస్ నందు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100/- రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10/- రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,40 కిలోల వేప పిండి బస్తా 950/- రూపాయలకు, డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9177427817 మరియు 9492761257. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామాలలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి. వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కొరకు CSA సంస్థ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.

41-2022(14-10-2022)

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 17mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 53-93 %, అలాగే గంటకి 9 కి.మి. వేగంతో తూర్పు దిశ గ గాలులు వీయవచ్చును .
. టివి పల్లె క్లస్ట ర్ లోనీ కుప్పా లపల్లి , ముసల్ రెడ్డి గారి పల్లె లో ప్రధాన పంట అయిన చీనీ నిమ్మ పంటలలో పెరుగు దల కొరకై జీవామృతం ని పారించాలి. అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా చేపల ద్రావణం పిచికారి చేయాలి. అలాగే కాయలు ఉన్న చీనీ తోటలలో పండు ఈగ కొరకు ఫ్రూట్ ఫ్లే ట్రాప్ పెట్టడం వలన పండు ఈగ ఉద్రుతిని తగ్గించవచ్చు. బక్కన్న గారి పల్లె, వెలమ వారి పల్లె గ్రామాలలో ప్రధాన పంట అయిన అరటి పంటలలో సిగ టోగ తెగులును గుర్తించడం జరిగింది.దీని నివారణకు ఎకరాకు 2 కిలోల ట్రై కో డ ర్మ విరిడి పౌడర్ ను 200 లీటర్స్ నీటిలో కలిపి పిచకారీ చేయాలి ఇలా 15 రోజులకు ఒకసారి పిచి కారి చేస్తూ భూమి కి కూడా ఇవ్వడం వలన నివారించ వచ్చు. అలాగే పత్తి పంటలో దోమ,కాయ తొలుచు పురుగు ఉదృతి ఎక్కువగా ఉంది.దీని నివారణకు ఎకరాకు 25-30 జిగురు పల్లాలు, 10 లింగ కర్షక బుట్టలు పెట్టడం వలన ఉదృతి తగ్గించవచ్చు మరియు వేపనూనె పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, వేప నూనె , తార్పాలిన్ పంటలు మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
అయితే పరిష్కారం కొరకు కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి