Author Archive Bhairava Kumar M

39-2022(01-10-22)Vemula Farm advisory

వేముల మండలం లో రాగల మరో 4 రోజుల యొక్క వాతావరణ సూచన – సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.వర్షపాతం 18 MM ఉండును.,కనిష్ట ఉష్ణోగ్రత :23డిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్టఉష్ణోగ్రత: 31 డిగ్రీల సెంటిగ్రేడ్ సరాసరి గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశగా గాలులు వీయును..గాలిలో తేమశాతం 82%-94% ఉంటుంది,
వేముల,వేల్పుల గ్రామాలలో పత్తి పంట లో పచ్చదోమ,తెల్లదొమ ఉధృతి ఎక్కువ వుంది ,కావున రైతులు జిగురు పల్లాలు ఎకరాకు 25 చొప్పున పెట్టుకోవాలి,మరియు దోమ నివారణకు వేపగింజల కషాయం పిచికారీ చేయాలి.
పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే ప్రతి 15 రోజుల కు ఒకసారి జీవామృతం ను పారించి,ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలోని రాజీలేని సూత్రాలను పాటించినట్లైతే పత్తి పంటలో రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. అలాగే భోనుయగారిపల్లి.
వేముల ,వేల్పుల కొన్ని గ్రామాలలో అరటి పంటలో చికటోగ సమస్య ఎక్కువగా ఉంది. కావున రైతులు 1 ఎకరాకు 2 కేజీల ట్రైకోడర్మ వీరిడి ని 200 lit నీటిలో కలిపి పారించాలి లేదా పిచికారి చేయాలి.అలాగే జామ తోటల్లో పండు ఈగ ఉధృతి ఎక్కువగా వుంది దీని నివారణకు పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి.భుమయ్యగరిపల్లి వేల్పుల.వేముల.మొబ్బుచింతలపల్లి గ్రామాలలో ట మోటా పంటలో పచ్చ దోమ తెళ్లదోమ వుధృతి ఎక్కువగా వున్నది .. టొమాటో లో వూదు నిర్మూలనకు పండు ఈగ బుట్టలు అమర్చాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పండు ఈగ బుట్టలు, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), మన వేముల రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 9347723277 కు ఫోన్ చేయగలరు.

అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వ వులన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

39-2022(01-10-22)Vempalli FPO

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 18mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 82-94 %, అలాగే గంటకి 8 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో దోమ నివారణ కొరకై వావిలాకు కషాయం ని పిచికారీ చేయవలెను. అలాగే ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ నిమ్మ లో ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
భూమి రికార్డులు
పంట రుణాలు
కౌలు రైతుల సమస్యలు
విత్తన సమస్యలు
మార్కెట్ యార్డులు, ధరలు
వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు ఫోన్ చేయండి.

39-2022(01-10-2022)Thungabhadra Farm Advisory

కిసాన్ మిత్ర ఫోన్ రేడియో రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతోంది.C. బెలగల్ మండలం లో రాగల ఐదు రోజులలో వాతావరణ సూచన. వర్షం 10 మిల్లీమీటర్ల దాకా పడవచ్చు . కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు గా ఉండే అవకాశం వుంది. గాలి గంటకి 6 కిలోమీటర్ల వేగంతో పడమర దిశగా వీయవచ్చు. వరి రైతులు పొలంలో రసం పీల్చు పురుగుల నివారణ కొరకు పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలు పెట్టుకోవలెను, కాండం తోలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవలెను . మిరప రైతులందరూ నారు వేసేటప్పుడు బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడి తో నారా శుద్ధి చేసుకోవలెను, అలాగే మిరప పంటలో రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గించుకోవడానికి సరిహద్దు పంటగా జొన్న, అంతర పంటలుగా ముల్లంగి, ధనియాలు, ఉల్లి, ఎర పంటలుగా బంతి మరియు ఆముదం వేసుకోవలెను. పత్తి పంటలో పేనుబంక మరియు తామర పురుగుల నివారణ కొరకు వేప నూనె పిచికారి చేసుకోవలెను మరియు జిగురు అట్టలు పెట్టుకోవలెను. పత్తి పంటలో పూత మరియు పిందెలు రాలకుండా ఉండడానికి మరియు కాయ సైజ్ పెరగడానికి సప్త ధాన్యంకుర కషాయం పిచికారి చేసుకోవలెను.తుంగభద్ర FPO సభ్యులకు 250 రూపాయలు విలువ చేసే జిగురు అట్టలు 100 రూపాయలకు,45 రూపాయలు విలువ చేసే పత్తి,వేరుశనగ, వరి, మిరప పంటలకు కావలసిన లింగాకర్షక బుట్టలను 10 రూపాయలకు, వేప నూనె ఒక లీటర్ 380/- రూపాయలకు,డబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేయర్స్ 3500/- రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది.కావున తుంగభద్ర FPO సభ్యులందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని మనవి. మరింత సమాచారం కోసం కొండాపురం మరియు ముడుమాల గ్రామంలో ఉన్న తుంగభద్ర సేంద్రియ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్ నందు కలవండి లేదా 8500983300 నెంబర్ కు కాల్ చేయండి.

36-2022(09-09-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 19mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 50-71 %, అలాగే గంటకి 23 కి.మి. వేగంతో ఉత్తరం మరియు పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

35-2022(03-09-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 76%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. అలాగే మెగ్నేషియం లోప నివారణకై ఆవు మూత్రం ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి.. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 వరకు పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే ఎర్ర పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి. అలాగే ఎదుగుదళ కొరకై జీవామృతం ని పారించాలి.అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

35-2022(28-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 5mm వర్షపాతం ఉండును. గాలిలో తేమ 74%, అలాగే గంటకి 14 కి.మి. వేగంతో ఉత్తరం మరియు పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి నివారణ కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వలన పత్తి కాయలో వచ్చే పురుగును నివారించవచ్చు.అలాగే చీనీ,నిమ్మ పంటలలో ఇగురు లో వచ్చే పేను బంక,పురుగు నివారణకు, వేపనూనె పిచికారి చేయాలి.మరియు భూమి సారవంతం కొరకు జీవామృతం 15 రోజులకు ఒకసారి పాటించాలి..అలాగే పూత కొరకు కోడి గుడ్ల ద్రావణం లేదా పంచగవ్య పిచికారి చేయాలి.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

33-2022(21-08-2022)Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన వర్షము – 2mm కురిసే అవకాశం వుంది . గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 27 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తాళ్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులకు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
ఇలా గతవారం చెపుకున్నాము, రైతులు ఒక సారి గమానించగలరు,
అలాగే పత్తి పంట వేసుకున్న రైతులు ముక్యంగా గమనించవలసిన విషయాలు,
1.మొదట నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి,
2.దేశీ వాలి విత్తనాలను సాగుచేయాలి,
3.పత్తి పంట లో అధికంగా గులాబీ రంగు పురుగు వృధితి ఎక్కువ గ ఉంటుంది
ఈ పురుగు అదుపు కు ఎమి చేయాలి.
విత్తనం పొలంలో నాటే ముందు విత్తన శుద్ది చేయాలి, ఇలా చేయడం వల్ల భూమి నుండి సంక్రమించే తెగులు రాకుండా చేసుకోవచ్చు
*పత్తిలో అలసంద, పెసలు, సోయాబీన్స్ అంతర పంట గా వేయడం వల్ల రైతు మిత్ర పురుగులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సస్యరక్షణ జరుగుతుంది, ఈ అంతర పంటలు వల్ల ఆదాయం కూడా వస్తుంది,
*యరపంట ఆముదం ,బెండ పత్తి పంట లో నాటుకొని దానిపై ఆశించిన లార్వాలు ను ,పురుగు గుడ్లను నాశనము చేయలి,
*పత్తి పంట చుట్టూ రక్షిత పంట గా 4 వరసలు జొన్న,సజ్జ విత్తాలి.
*పురుగుల మందులు పిచికారీ ఆపేయడం వల్ల పొలంలో మిత్ర పురుషులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది.
*పొలంలో ఎకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు.
*తల్లి పురుగుల గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయం పిచికారీ చెయ్యాలి 5 రోజుల వ్యవధి తో 2 సార్లు స్ప్రే చేయాలి,
మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం

33-2022(19-08-22)Vempalli Farm Advisory

వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 62%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును .
టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు.
అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు.
అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.??
👉 భూమి రికార్డులు
👉పంట రుణాలు
👉 కౌలు రైతుల సమస్యలు
👉 విత్తన సమస్యలు
👉 మార్కెట్ యార్డులు, ధరలు
👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు
👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం
తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.

32-2022(14-08-2022) Proddatur Farm Advisory

ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 2mm. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 26 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు .
తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా
వరిలో పాటించవలసిన మెళకువలు
1.భూసార యాజమాన్య పద్ధతులు
2.సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది
*పసుపు, తెలుపు ప్లేట్స్
*రక్షకపంటలు
*లింకాకర్షక బుట్టల
*కోసలు తుంచి నాటడం
*కాలిబాటలు
*అజోళ్ళ
భూసార యాజమాన్య పద్ధతులు:
వివిధ రకాల విత్తనాలతో పచ్చి రొట్టె ఎరువులు పెంచి 40 రోజుల వయసులో భూమి లో దున్నాలి,మొక్కలకు పోషక పదార్థాలు అందించే సూక్ష్మ క్రిములు బాగా పెరిగి భూమిలో జీవపదారం అభివృద్ధి చెందుతుంది, సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళి పోషకాలు విడుదల అవుతాయి.
ఈ విషయాలు రైతులు గమనించాలి.
*సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు
* నారుసుద్ది*
ఎపుడు; నారు నాటే ముందు
ఎందుకు: నారు ద్వారా ఆశించే తెగుళ్లు ను నివారించడానికి
*పసుపు, తెలుపు ప్లేట్స్
ఎపుడు; నారు నాట్లు వేసిన తర్వాత ,ప్లేట్స్ మొక్కలకు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
ఎందుకు: చిన్న చిన్న రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ని తెలుసుకోవచ్చు, వాటిని నివారించవచ్చు.
ఎకరానికి 20నుండి 25 ప్లేట్స్ పెట్టాలి.
*రక్షకపంటలు
ఎపుడు:వరిలో నాట్లు వేసిన తర్వాత బంతి నారు నాట్లు వేయాలి.
ఎందుకు:పురుగుల, తెగుళ్లు వ్యాప్తి ని నివారించడానికి, మిత్ర పురుగుల అభివృద్ధి కి
*లింకాకర్షక బుట్టలు
వరిలో నాట్లు వేసిన తర్వాత 10నుంచి 15 పెట్టాలి, వరిలో కాండం తొలిచే పురుగు నివారించడానికి
కోసలు తుంచి నాటడం :
వరి నాట్లు వేయడానికి ముందు ,కాండంతొలిచే పురుగు గుడ్ల సముదాయం నివారించడానికి, నాటే ముందు కోసలు తుంచి నాటాని
*కాలిబాటలు
వరి నాట్లు వేసే సమయంలో దోమ పొట్టు మరియు రసం పీల్చే పురుగుల నియంత్రించేందుకు వరిలో ప్రతి 2 metres లకు 30 cm కాలి బాటలు వదలాలి.
వరిలో అజోళ్ళ
పంటకు నత్రజని అందించడానికి, కలుపు నివారణకు ఉపయోగపడతాయి.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.